రాబర్ట్ కియోసాకీ ప్రప్రంచ వ్యాప్తంగా అమ్ముడు పోయిన పుస్తకం 'రిచ్ డాడ్ - పూర్ డాడ్’ రచయిత. తన 47వ ఏట పదవీ విరమణ చేసాక ఆయన క్యాష్ ఫ్లో టెక్నాలజీస్ సహవ్యవస్థాపకుడుగా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్లమంది ప్రజలకు డబ్బు గురించి ఎలా ఆలోచించాలో నేర్పి, వాళ్ల జీవితాలను అత్యంత ప్రభావితం చేసాడు. మూస భావాలను ధైర్యంగా ఎదుర్కోవటంలో పేరు గడించాడు. వ్యాపారం, విద్యారంగం, స్థిరాస్తులు, పెట్టుబడుల విషయాల్లో తనకున్న అనుభవాన్ని, మహిళలకు నేర్పించడం ద్వారా వాళ్లు తమ జీవితాలను తమ చేతుల్లో ఉంచుకోగలుగుతారని ప్రగాఢంగా నమ్మటం వల్ల, కియోసాకీ ఆ దిశలో విశేషమైన కృషి చేసాడు. యవ్వనంలో పదవీ విరమణ చేయటం ద్వారా సంపన్నులుగా ఎలా మారిపోవాలనేది యీ పుస్తకంలో ఆయన వివరించారు.